సిద్దిపేట : ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్ధం. మరోవైపు మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సిద్దిపేట (Siddipet ) పట్టణంలోని 220 కేవీ సబ్ స్టేషన్(substation) లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా పీటీఆర్ పేలి మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న స్థానికులు పేలుడు దాటికి బయటకు వచ్చారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీష్రావు(Mla Harsih Rao) , దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar reddy) ఘటనాస్థలానికి బయలు దేరారు. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఫైర్ స్టేషన్ అధికారులతో మాట్లాడి మూడు ఫైర్ ఇంజన్లు ఏర్పాటుచేసి మంటను ఆర్పాలని కోరారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఫోన్ లో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.