చేర్యాల, నవంబర్ 15 : ఈ నెల 18వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో హుండీలను విప్పి లెక్కింపు చేయనున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. భక్తులు వేసిన కానుకలతో స్వామి వారి హుండీలు నిండాయని నగదు లెక్కింపు జరిపి బ్యాంకులో జమచేయనున్నట్లు తెలిపారు.
అలాగే భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బియ్యం హుండీలను తూకం వేయనున్నట్లు తెలిపారు. లెక్కింపులకు ఆయాశాఖల అధికారులు, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది హాజరుకావాలని కోరారు.