సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 5 : జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ 100 శాతం పక్కాగా జరగాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూ రు క్రాం తి అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎంట్రీ చేయాలని ఆపరేటర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజా పాలన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదుపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, టీంలీడర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో డాటా ఎంట్రీ చేయించాలని సూచించారు. ఆపరేటర్లు తప్పు చేస్తే మార్చాలని తెలిపారు. డాటా ఎంట్రీకి ఎంపీడీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, టీంలీడర్ బాధ్యత వహించాలన్నారు. అంతకుముందు ప్రజాపాలన దరఖాస్తుల్లోని అంశాలకు సంబంధించిన డాటా ఎంట్రీ ఏ విధంగా చేయాలన్న దానిపై మాస్టర్ ట్రైనర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.
మెదక్, జనవరి5 (నమస్తే తెలంగాణ) : ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొర్లకుండా వెబ్సైట్లో నమోదు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టర్లో కంప్యూటర్ ఆపరేటర్లకు డాటా ఎంట్రీ నమోదుపై ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. మెదక్ మున్సిపాటిటీలో 55 బృందాలు, పంచాయతీల్లో 425 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 319మంది ప్రభు త్వ డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 16 ప్రైవేట్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు మొత్తంగా 480మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించినట్లు తెలిపారు. ఈ నెల 17 వరకు వివరాలను ఆన్లైన్లో నమో దు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా పం చాయతీ అధికారి సాయిబాబా, ఈడీఎం సందీప్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్, జనవరి 5 : ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను ప్రతి ఆపరేటర్ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీపై ఎంపిక చేసిన ఆపరేటర్లకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గ్రామానికి ఒకరు, మున్సిపల్ వార్డుకు ఒకరు చొప్పున మొత్తం 552 మంది ఆపరేటర్లు, 26మంది మాస్టర్ ట్రైనర్స్ పని చేయనున్నారని కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, డీపీవో దేవకీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.