మెదక్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రజా పాలనతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజా పాలన కార్యక్రమముపై సమీక్ష నిర్వహించారు. పజా పాలన నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రజా పాలన దరఖాస్తు ఎలాంటి రుసుము లేదన్నారు. ప్రతి వంద మంది కి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలన్నారు. మెదక్ జిల్లాలో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ సూల్ ఏర్పాటు కోసం 10 ఎకరాల స్థల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింద ని పేరొన్నారు. అమర వీరులకుటుంబాలు 250 గజాల ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేస్తామని పేర్కొన్నారు.
మెదక్రూరల్/నర్సాపూర్/కొల్చారం/ వెల్దురి/చేగుంట/అల్లాదుర్గం,డిసెంబర్ 26 : ప్రజా పాలనను పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ మండల స్పెషల్ అధికారి(జిల్లా మైనింగ్ అధికారి) జయరాజ్ అన్నారు. మంగళవారం మెదక్ మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీరాములు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ యమునతో కలిసి ప్రజాపాలనపై సమీక్ష నిర్వహించారు. అల్లాదుర్గం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో శంకర్ అన్నారు. నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్గోపాల్ ఆధ్వర్యంలో ప్రజాపాలనపై సమావేశాన్ని నిర్వహించారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గణేశ్ రెడ్డి అధ్యక్షతన ప్రజాపాలనపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లతోపాటు ఆయా శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలకు ప్రజాపాలనపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో వెంకటలక్షమ్మ పాల్గొన్నారు. ప్రజాపాలనను విజయవంతం చేయాలని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. చేగుంట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు.
శివ్వంపేట, డిసెంబర్ 26 : ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో భారతి అన్నారు. మండల ప్రత్యేకాధికారి నర్సయ్యతో కలిసి సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రజాపాలన గ్రామసభలు, దరఖాస్తుల స్వీకరణపై ఎంపీపీ కార్యాలయంలో అవగాహన కల్పించారు.