హుస్నాబాద్, జూన్ 24: రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ సర్కారు దవాఖానలో ఇన్పేషెంట్లకు భోజన సదుపాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే సర్కారు దవాఖానలకు కొత్త రూపు వచ్చింది. హాస్పిటల్స్లో సకల సదుపాయాతో ప్రజలు మెరుగైన సేవలను పొందుతున్నారని చెప్పారు. ఒకప్పుడు సర్కారు దవాఖానకు వచ్చేందుకు భయపడిన రోగులు ఇప్పుడు దవాఖానకు వచ్చి క్యూలు కడుతున్నారని అన్నారు.
మంత్రి హరీశ్రావు కృషితో హుస్నాబాద్ దవాఖాన వైద్య విధాన పరిషత్కు మార్చబడి అన్ని రకాలైన వైద్య సేవలు అందేలా తయారైందన్నారు. త్వరలోనే మాతాశిశు సంరక్షణ కేంద్రం 50పడకలతో నిర్మాణం కాబోతోందని పేర్కొన్నారు. దవాఖానలోని రోగులకు మూడు పూటలా పౌష్టికాహారం అందించేందుకు డైట్ కార్యక్రమం ప్రారంభించామన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, కౌన్సిలర్లు బోజు రమ, బొజ్జ హరీశ్, శంకర్రెడ్డి, సూపరిండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సౌమ్య, నాయకులు వెంకట్రాంరెడ్డి, ఎండీ అన్వర్, చిట్టి గోపాల్రెడ్డి, ఆకుల వెంకట్, లక్ష్మణ్నాయక్, బొల్లి శ్రీనివాస్, బండి పుష్ప, సారయ్య, విజయభాస్కర్, ఇంతియాజ్ పాల్గొన్నారు.