రాయపోల్, మే 31 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని చిన్న మాసాన్పల్లి(Chinna Masanpally) గ్రామానికి చెందిన శ్రీశాంత్ ముదిరాజ్ భారత సైన్యానికి ఎంపికయ్యాడు. గజ్వేల్లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీశాంత్ కృషి, పట్టుదలతో ఆర్మీలో చేరాలనే తన కలను నిజం చేసుకున్నాడు. రాయపోల్ మండలంలో ఇప్పటివరకు మొత్తం 9 మంది యువకులు భారత సైన్యానికి ఎంపికవ్వగా.. వారిలో 8 మంది ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందడం విశేషం.
భారత సైన్యంలో సోల్జర్గా శ్రీశాంత్ ముదిరాజ్ ఎంపికవ్వడం పట్ల ఆజాద్ డిఫెన్స్ అకాడమీ కావడం పట్ల నిర్వాహకులు చైర్మన్ నీల చంద్రం (రిటైర్డ్ ఆర్మీ ) సంతోషం వ్యక్తం చేశారు. తమ అకాడమీలో గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా దేశ సేవకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
శ్రీకాంత్ సైన్యంలో ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, చిన్న మాసన్పల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశాంత్ ముదిరాజ్ సాధించిన విజయం పట్ల గ్రామ పెద్దలు, యువకులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు. సైన్యంలో చేరనున్న శ్రీకాంత్ మరెంతో మంది యువతకు ఆదర్శంగా నిలవాలని వారంతా ఆకాంక్షించారు.