రాయపోల్ ఆగస్టు 08 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) వ్యవస్థాపకులు సోరాబ్జీ పోచకన్వాలా (Sorabji Pochkhanawala) 144 వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది ఆధ్వర్యంలో ఖాతాదారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్యాంకు ఆవరణలో సోరాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సిబ్బంవది.
ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సృంజేయ్ పాల్ (Srinjay Pal) మాట్లాడుతూ.. ‘దేశంలో మొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మొదటి స్వదేశీ బ్యాంక్గా 1911లో స్థాపించారు. 114 సంవత్సరాల క్రితం బ్యాంక్ ఏర్పాటు కావడంతో ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం చేకూరింది. గ్రామీణ ప్రాంతాల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఏర్పాటు చేసిన ఘనత వ్వవస్థాపకులు సోరాబ్జీ పోచకన్వాలాకే దక్కింది’ అని సృంజేయ్ తెలిపారు.
సోరాబ్జీ పోచకన్వాలా జయంతి వేడుకలో పాల్గొన్న సిబ్బంది
గ్రామీణ స్థాయిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంక్ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకుగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు మేనేజర్. ప్రతి ఖాతాదారునికి తక్షణ సేవలు అందించడమే తమ బ్యాంకు లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాకేష్. క్యాషియర్ శ్రీకాంత్. బ్యాంకు సిబ్బంది రమేష్. బ్యాంకు ఖాతాదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.