చేర్యాల, జూలై 1 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 5వ తేదీన సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
స్వామి వారి ఆలయానికి సంబంధించిన కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే లైసెన్స్ హక్కు, మొక్కుబడి వస్త్రాలు పోగు చేసుకునే లైసెన్స్ హక్కు, కోరమీసాలు ఇతర మొక్కుబడి వస్తువులు విక్రయించుకునే లైసెన్స్ హక్కులు, సెల్ఫోన్స్ భద్రపర్చుకొనే లైసెన్స్ హక్కులకు సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వ్యక్తులు వేలం పాటల్లో పాల్గొనాలని ఆయన కోరారు.