చేర్యాల, డిసెంబర్ 16 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఈనెల 20వ తేదీన వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపారు. ఆలయానికి పట్నాల బట్ట (తెల్లబట్ట), ఓం నవ:శివాయ శెల్లాలు, జరీ శెల్లాలు, జాకీటు పీసులు సరఫరా చేసేందుకు సీల్డు టెండరు, వేలం పాటలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆసక్తిగల వ్యాపారులు ఆలయ నియమ,నిబంధనల మేరకు టెండర్లలో పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.