రాయపోల్,అగస్టు07 : సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని గజ్వేల్ ఏసీపీ నరసింహులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రామారం గ్రామంలో గ్రామస్తులు దుర్గాప్రసాద్, హనుమంతు, గోపాల్, మహేష్ గౌడ్ సహకారంతో గ్రామంలో పది సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. గురువారం ఏసీపీ నరసింహులు, తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానసతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు మరింత భద్రతను కల్పిస్తాయన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రతి ఒక్కరూ నిఘా ఉంచాలని, ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా యువకులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి లింకులు వచ్చినా ఓపెన్ చేయవద్దని సూచించారు. మానవ తప్పిదాల వల్లనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు.