సిద్దిపేట, జనవరి 2 : పేదప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, బస్తీ దవాఖానలతో పట్టణ నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 11వ వార్డు లో ఏర్పాటు చేసిన నూతన బస్తీ దవాఖానను ప్రారంభించారు. 21వ వార్డులో సీసీ రోడ్లు, 3వ వార్డులో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాళ్లకుంట కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బస్తీల్లో నివసిస్తున్న ప్రజలకు అన్నిరకాల మందులు, సౌకర్యాలతో కూడిన దవాఖానను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సిద్దిపేటలో త్వరలో వెయ్యి పడకల దవాఖాన అందుబాటులోకి రానున్నదన్నారు. సిద్దిపేట జనరల్ దవాఖానలో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే కిమోథెరపీ, రెడియోథెరపీ, క్యాత్ల్యాబ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు.
రాబోయే రోజుల్లో కాన్సర్, కిడ్నీ, గుండె వ్యాధుల ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. పేదల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సం క్రాంతి పండుగ తర్వాత ఇల్లు కట్టుకునే వారికి రూ.3లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. పేదలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. బస్తీ దవాఖానలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు సిద్దిపేట పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. కాళ్లకుంట కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ మిగిలిన పనులకు రూ.25లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. కాళ్లకుంట కాలనీ ప్రజలకు ఇంటి పట్టా లు అందజేశామని, మిగిలిన వారికి త్వరలో అం దజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, మాజీ మున్సిపల్ చైర్మ న్ కడవేర్గు రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాలసాయిరాం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సీనియర్ నాయకుడు వేణుగోపాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కనుకరాజు, కౌన్సిలర్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, వంగ రేణుకాతిరుమల్రెడ్డి, అక్తర్ పటేల్, కౌన్సిలర్లు లక్ష్మణ్, సుందర్, సతీష్, నాగరాజురెడ్డి, విఠోబా, కోఆప్షన్ సభ్యులు మేర సత్తయ్య, నాయకులు సాకీ ఆనంద్, రాజు, రాజే శం, మణిక్యాలరావు, బైరయ్య పాల్గొన్నారు.