సిద్దిపేట టౌన్, మే 22 : లండన్ పర్యటనలో ఉన్న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సిద్దిపేట వాసులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన గ్రీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణానికి చెందిన సాయికృష్ణారెడ్డి, సాయికిరణ్ కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ యువకులు గ్రామాల అభివృద్ధికి తమవంతుగా సహాయపడాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అక్కడి వాసులకు మంత్రి కేటీఆర్ వివరించారు. ఎన్నారైలు తమ గ్రామాలను అభివృద్ధి పర్చుకోవాలని చెప్పారు.