సీఎం కేసీఆర్ ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, రూ.1000 కోట్లతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని పొన్నాల గ్రామ శివారులో 3 ఎకరాల స్థలంలో రూ.7.50 కోట్లతో నిర్మించిన ముదిరాజ్ ఏసీ ఫంక్షన్హాల్ను గురువారం మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మూడేండ్లు తిరిగినా ఒక కొత్త సొసైటీ వచ్చేది కాదన్నారు. ఇప్పుడు సీఎంకేసీఆర్ 2 వేల సొసైటీలు ప్రారంభించి, 2 లక్షల మందికి కొత్తగా సభ్యత్వాలు ఇచ్చారని చెప్పారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 98 కొత్త సొసైటీలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల చెరువుల్లో చేపలు పట్టుకునే హక్కులు మత్య్యకారులకే ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే అని గుర్తుచేశారు. భవిష్యత్లో ముదిరాజ్ల గౌరవం పెరిగేలా అవకాశాలు కల్పిస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు.
– సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 5
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 5: సిద్దిపేట అన్నిరంగాల్లో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందని, ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణంలోనూ ఆదర్శంగా నిలిచామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని పొన్నాల శివారులో మూడు ఎకరాల స్థలంలో రూ.7.5 కోట్లతో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ ఏసీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ముదిరాజ్తో కలిసి మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముదిరాజ్ల కోసం రూ.7.5కోట్లతో సిద్దిపేటలో ఉత్తమమైన ఫంక్షన్హాల్ను నిర్మించుకున్నామన్నారు. మిగతా సౌకర్యాల కల్పనకు మరో రూ.50 లక్షలు మంజూరు చేస్తానన్నారు. సిద్దిపేట పట్టణంతో పాటు చాలా గ్రామాల్లో ముదిరాజ్ కమ్యూనిటీ హాళ్లను నిర్మించుకున్నామని చెప్పారు. అంతే కాకుండా నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పెద్దమ్మ ఆలయాలకు సాయం చేసినట్లు గుర్తు చేశారు.
సాయం చేయడమే కాకుండా పెద్దమ్మతల్లి ఉత్సవాలకు స్వయంగా హాజరైనట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూ డేండ్లు తిరిగినా ఒక కొత్త సొసైటీ రాకుండే, కానీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకు 2 వేల సొసైటీలు ప్రారంభించి, 2 లక్షల మందికి కొత్తగా సభ్యత్వాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. వారిలో 80శాతం మంది ముదిరాజులే ఉన్నారన్నారు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 98 కొత్త సొసైటీలు ఏర్పా టు చేశామన్నారు. గ్రామాల్లోని చెరువుల్లో చేపలు పట్టుకునే హక్కులు గ్రామంలో ఉన్న మత్స్యకారులకే ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు కేవలం సీఎం కేసీఆర్ మా త్రమే అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.1000 కోట్లతో మత్స్యకారులకు వివిధ రకాల వస్తువులు పంపిణీ చేసి, ఉపాధి కల్పించిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో ముదిరాజ్లకు క్యాబినేట్ మంత్రి హోదాతోపాటు రాజ్యసభ సభ్యత్వం, శాసనమండలి వైస్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ మొదటిసారిగా కల్పించింది సీఎం కేసీఆర్ మాత్రమే మని మంత్రి అన్నారు. ఇంకా భవిష్యత్లో ముదిరాజ్ల గౌరవం పెరిగేలా ప్రభుత్వంలో, చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. కొందరు రాజకీయంగా చిచ్చపెట్టి లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నారని, వారి ఉచ్చులో పడకూడదని మంత్రి సూచించారు. భవిష్యత్లో సిద్దిపేట జిల్లాలో కూడా ముదిరాజ్లకు అనేక అవకాశాలు కల్పిస్తామని మంత్రి హరీశ్రావు హామీనిచ్చారు.
సిద్దిపేటలో నిర్మించిన ఏసీ కన్వెన్షన్ హాల్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజులకే గర్వకారణమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు. ఫంక్షన్ హాల్ నిర్మించిన మంత్రి హరీశ్రావుకు ముదిరాజ్ల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా హుస్నాబాద్లో కూడా ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు స్థల సేకరణకు ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కొమురవెళ్లితో పాటు ప్రముఖ ఆలయాల వద్ద ముదిరాజ్ల కోసం సత్రాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో హైదరాబాద్లోని కోకాపేటలో 5 ఎకరాల స్థలాన్ని ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకున్నట్లు తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ సొసైటీలో సభ్యత్వం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో చేపలు పట్టుకునే సర్వ హక్కులు మత్స్యకారులకు కల్పించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ జంగిటి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.