సిద్దిపేట, డిసెంబర్ 1 : అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీలకు జిల్లా సైక్లింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్య క్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటనర్సయ్య తెలిపారు. జిల్లాకు చెందిన వరియెగుల ఉదయ్, అబ్బరబోయిన రామకృష్ణ, ఐలెని వరుణ్రెడ్డి, గుగులోత్ సంతోశ్, సూరంపల్లి సుమిత్ ఎంపికయ్యారు.
నవంబర్ 19న ఉస్మానియా యూనివర్సిటీలోని వెల్లోడ్రాంలో జరిగిన రాష్ట్రస్థాయి ట్రాక్ పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చారు. ఎంపికైన క్రీడాకారులను జడ్పీ వైస్ చైర్మన్ రాయిని రాజిరెడ్డి, డీవైఎస్వో నాగేందర్, ఎంపీపీలు మాలోత్ లక్ష్మీబీలూనాయక్, వసంత, జడ్పీటీసీ మంగ, ఏఎంసీ చైర్మన్ అశోక్బాబు, క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు అభినందించారు.