పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట/ రేగోడ్/ టేక్మాల్/ అల్లాదుర్గం/ రామాయంపేట/ మనోహరాబాద్/ నర్సా పూర్/ కొల్చారం/ చిలిపిచెడ్, ఫిబ్రవరి 19 : మతసారస్యా నికి ఛత్రపతి శివాజీ ప్రతీక అని, ఆయన బాటలో ప్రతి ఒక్క రూ పయనించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట మండలం కలాపురం గ్రామంలో ఆదివారం చత్రపతి శివాజీ విగ్రహన్ని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళిపంతులు, సర్పంచ్ కుంట్ల రాములు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, ఎంపీటీసీలు వీణాసుభాశ్గౌడ్, స్వప్నారాజేశ్వర్, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, నాయకులు యాదుల్, జగన్ పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో శోభాయాత్ర
పెద్దశంకరంపేటలో బజ్రంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, శివాజీ యువజన సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్రను రామాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు నిర్వహించారు. ఊరూరా శివాజీ మహారాజ్ జయంతి చిన్నశంకరంపేట మండలంలో శివాజీ జయంతి నిర్వహించారు. శివాజీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతిగౌడ్, ఎంపీటీసీ ప్రసాద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేగోడ్ మండలంలోని కొత్వాల్పల్లి, చౌదర్పల్లి, రేగోడ్, లింగంపల్లి, తాట్పల్లి గ్రామాల్లో 394వ శివాజీ జయంతి నిర్వహించారు. టేక్మాల్ మండలంలోని కోరంపల్లి, కాదులూర్ గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అల్లాదుర్గం మండలకేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
రామాయంపేట భారీ ర్యాలీ
రామాయంపేట పట్టణంలో శివాజీ యూత్, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులతోపాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ తదితరులు మెదక్ చౌరస్తాలోని శివాజీ విగ్రహానికి పూలమాలు వేసి, నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో బైక్ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాదగిరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణాధ్యక్షుడు నాగరాజు, శివాజీ యూత్ నాయకు లు కృష్ణాగౌడ్, రాములు, మల్లేశం, కౌన్సిలర్లు యాదగిరి, సుందర్సింగ్, శంకర్గౌడ్, ముత్యాలు, అశోక్, శ్రీనివాస్, నరేశ్, కొండల్రెడ్డి, పండరినాధ్, శ్యాంసుందర్, ప్రసాద్, కాలేరు ప్రసాద్, శంకర్, చింతల యాదగిరి, అనిల్, దేవుని రాజు, మహేశ్, మధునాల స్వామిగౌడ్ పాల్గొన్నారు.
మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, మనోహరాబాద్, తుపాకులపల్లి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు బైక్ర్యాలీ నిర్వహించారు. కొండా పూర్ గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్ శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శివాజీ స్ఫూర్తితో కలిసికట్టుగా ఉండాలి
కొల్చారం మండలకేంద్రంతోపాటు పైతర, సంగాయిపేట, రంగంపేట, చిన్నాఘన్పూర్ గ్రామాల్లో శోభాయాత్రలను నిర్వహించారు. పైతరలో బీఆర్ఎస్ నాయకుడు యాభన్నగారి రవితేజరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరూ శివాజీని స్ఫూర్తిగా తీసుకుని కలిసికట్టుగా ఉండాలన్నారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్ తాటి రమేశ్, యువజన సంఘాల నాయకులు మిద్దె సాదుల్లా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్, చండూర్, ఫైజాబాద్ గ్రామాల్లో శివాజీ 393వ జయంతిని నిర్వహించారు.