రేగోడు/ అల్లాదుర్గం/ టేక్మాల్/ మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 6 : రేగోడు మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాల వద్ద మంగళవారం అందోల్ ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇటిక్యాల్(ఆర్) నుంచి రేగోడ్ వరకు బైక్ర్యాలీ నిర్వహించారు. హోప్ న్యూరో దవాఖాన (సంగారెడ్డి) ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధా న కార్యదర్శి రమేశ్, నేతలు మొయిజ్, బాబా, కృష్ణ, సుభాష్, రాధాకిషన్, నర్సింగ్రావు, హమీద్, హన్మండ్లు, పండల్రెడ్డి, భూంరెడ్డి, మానెప్ప, అల్తాప్ పటేల్, పీఏసీఎస్ చైర్మన్ రాజూయాదవ్, ఎంపీటీసీ నర్సింహులు, సర్పంచ్లు రవీందర్, తుకారాం నాయక్, సిద్ధారెడ్డి, నర్సింహులు, సంగయ్య పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకుడు
రేగోడ్కు చెందిన వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మైబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే చంటి క్రాం తికిరణ్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. ప్యారారం గ్రామానికి చెందిన పెద్దగొల్ల యాదగిరి, గుడిసె జనార్దన్, ఇటిక్యాల్(ఆర్) తండాకు చెందిన శ్రీనునాయక్ టీఆర్ఎస్లో చేరారు.
ఎమ్మెల్యేను సన్మానించిన జర్నలిస్టులు
ఎమ్యెల్యేను జర్నలిస్టులు సన్మానించారు. వీరిలో సంతోశ్, గోవింద్, షాహెద్ అలీ, సుభాష్గౌడ్, వి.సంతోశ్, చంద్రమోహన్, సంతోశ్రావు, సంగమేశ్వర్ తదితరుల ఉన్నారు. హోప్ న్యూరో దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరంలో వైద్యులు శ్యాంసుందర్, శీను, దర్శన్, యాదన్న, వైద్య సిబ్బంది శ్రీనివాస్, పాండు రాథోడ్ పాల్గొన్నారు.
అల్లాదుర్గంలో మెగా వైద్యశిబిరం
అల్లాదుర్గం బస్టాండ్లో టీఆర్ఎస్ నేతలు కేక్ కట్ చేసి, ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఎల్జీ దవాఖాన ఆధ్వర్యంలో వైద్యశిరం నిర్వహించి, 300 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2డీఏకో తదితర పరీక్షలు నిర్వహించా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహు లు, నాయకులు బచ్చు రమేశ్, కృష్ణ, సాయికుమార్, పవన్, మాజీ ఎంపీపీ కాశీనాథ్, సర్పంచ్, ఎంపీటీసీ ఫోరం మండ లాధ్యక్షులు అంజియాదవ్, ఎంపీటీసీ దశరథ్ పాల్గొన్నారు.
టేక్మాల్ గాంధీ భవన్లో వైద్యశిబిరం
టేక్మాల్ మండలకేంద్రంలోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ నాయికోటి సుప్రజా భాస్కర్ ప్రారంభించారు. శిబిరంలో కేబీఆర్ లైఫ్కేర్ దవాఖా న వైద్యులు రమేశ్, దివ్యవాణి, తుకారాం, నర్సింహయాదవ్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, నాయకులు కమ్మరి సిద్ధయ్య, సర్పంచ్లు సాయిలు, గోపాల్, ఉపసర్పంచ్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
మెదక్లో వృద్ధులకు పండ్లు పంపిణీ
మెదక్ పట్టణంలోని సంధ్యా నిలయంలో టీఆర్ఎస్ శ్రేణు లు వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్, నాయకులు అశోక్యాదవ్, భువన్ కుమార్, నర్సింహులు పాల్గొన్నారు.