గజ్వేల్, జనవరి 13 : గజ్వేల్ క్రీడలకు చిరునామాగా మారిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. పట్టణంలోని స్పోర్ట్స్ హబ్ మైదానంలో గజ్వేల్ ఫుట్బాల్ క్లబ్, సదాశివపేట ఫుట్బాల్ క్లబ్ సీనియర్ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ శుక్రవారం ఉదయం గజ్వేల్ మినీ స్టేడియంలో జరిగింది. మ్యాచ్ను ఎఫ్డీసీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గ క్రీడాకారులు అన్నిరకాల క్రీడల్లో ముందుండడమే కాకుండా ఈ ప్రాంతం అన్నీ రకాల క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నదన్నారు.
ఈ ప్రాంతం నుంచి వివిధ క్రీడల్లో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాష్ర్టానికి ప్రాతినిథ్యం వహించడంతోపాటు విజయాలు సాధించారన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికి గజ్వేల్లో 28 ఎకరాల విస్తీర్ణంలో త్వరలో క్రీడాహబ్ నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, నాయకులు దుర్గాప్రసాద్, ఫుట్బాల్ క్లబ్ గౌరవాధ్యక్షుడు గంగిశెట్టి రవీందర్, ఏఎంసీ డైరెక్టర్ సయ్యద్ మతిన్, అధ్యక్షులు నగేశ్, అహ్మద్, స్వామిచారి, ఎక్బాల్, జిలాని, అశోక్, ప్రధాన కార్యదర్శి రాంగారి గణేశ్, కోశాధికారి గంగాల నరేశ్, క్రీడాకారులు పాల్గొన్నారు.