జహీరాబాద్, జూలై 13: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి గోవర్ధన్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్రావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జహీరాబాద్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తంజీం పుట్టినరోజు సందర్భంగా హరీశ్రావు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, జహీరాబాద్ పట్టణ కౌన్సిలర్ తంజీం, దీపక్ పాల్గొన్నారు.