పెద్దశంకరంపేట/ నిజాంపేట/ చిలిపిచెడ్, జనవరి 20 : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన గుజ్జరి యాదగిరికి రూ. 60 వేలు, అలిగె అంబదాస్కు రూ.40 వేలు, నందయ్యగారి కౌసల్యకు రూ. 16వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, బీఆర్ఎస్ నాయకులు పున్నయ్య, రజనీకాంత్ పాల్గొన్నారు.
బాధితులకు ప్రభుత్వం అండ..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధితులకు అండగా నిలుస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిజాంపేట మండలకేంద్రంలో కల్వకుంట గ్రామానికి చెందిన రామవ్వకు రూ.50వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఇఫ్కో డైరెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొండల్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంపత్, ఏఎం సీ డైరెక్టర్ వెంకటేశం, నాయకులు నాగరాజు, రాజు, అబ్దుల్ ఆజీజ్, సంగుస్వామి, నర్సింహులు, లక్ష్మీనర్సింహులు, రాములు, రంజిత్, నగేశ్, లక్ష్మణ్ ఉన్నారు.
పేదలకు ఆసరా : వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి అన్నారు. మండలంలోని అజ్జమర్రి గ్రామానికి చెందిన శేఖమ్మకు మంజూరైన రూ.18 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ మేరకు అజ్జమర్రి గ్రామానికి వెళ్లి బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అజ్జమర్రి, చిట్కుల్ సర్పంచ్లు పరశురాంరెడ్డి, గోపాల్రెడ్డి, ఎంపీటీసీ మల్లయ్య, నాయకుడు మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.