నిజాంపేట, మార్చి 23: మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం పారిశుధ్య పనులు చేపడుతూ స్వచ్ఛతకు కృషిచేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా తమ సమస్యను పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. నిరసనలో పారిశుధ్య కార్మికులు రాజు, మైసయ్య, మల్లేశం, రవి, నాగవ్వ తదితరులు పాల్గొన్నారు.