సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని కిరాతకులు దారుణంగా హత్య చేశారు. అనంతరం తల, మొండెం వేరు చేశారు. జిల్లాలోని బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కడవత్ రాజు నాయక్(32)పై మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఈనెల 24న కేసు నమోదు కాగా.. 25న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతడిది వెల్లిమల తండా.
అయితే.. భూతగాదాలతో రాజు నాయక్ను హత్య చేసి తల, మొండెం వేరు చేసి.. తలను రాయికోడ్ మండలం కుసునూర్ గ్రామ శివారులో పడేశారు. మొండెంను న్యాకల్ మండలం రాఘపూర్ గ్రామ శివారులో పడేసి వెళ్లిపోయారు. రాజు నాయక్ హత్య భూపంచాయితీ కారణంగా జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజు నాయక్ను హత్య కేసులో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.