మునిపల్లి, ఫిబ్రవరి 13 : మునిపల్లి మండల పరిధిలోని బుసరెడ్డిపలి గ్రామ శివారులో గల ఓ గుట్టపై పూరాతన విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
బుసరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ గుట్టపై మల్లన్న దేవుడి విగ్రహం లభ్యమైనట్లు స్థానిక ప్రజలు గమనించి విగ్రహాన్ని పైకి తీసి పూజ కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం గ్రామస్తులు వేద పండితుల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అంతే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం బుసిరెడ్డిపల్లిలో వెలసిన మల్లన్న దేవుడిని దర్శించుకున్నారు.