మనూరు, నవంబర్24 : పాము కాటుతో మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మాయికోడ్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బేగరి పారమ్మ (65) మంగళవారం సాయంత్రం ఇంటి దగ్గర పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెల్లారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం బీదర్లోని దవాఖానకు తీసుకెళ్లగా బుధవారం మృతి చెందిందని కుటుంబ సుభ్యులు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు.