మునిపల్లి,జులై 19 : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామం వద్ద గల వెవెట్ దాబా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ లోని శంబుపూర కోట తెర్మల్ కాలనీకి చెందిన ప్రేమ్లత(64)అనే మహిళ అమె భర్త, గ్రామస్తులతో కలిసి ఈ నెల 14న శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు. మంగళవారం(19)న తెల్లవారు జామున మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో గల వెవెట్ దాబా వద్ద కాలకృత్యాలు పూర్తి చేసుకునేందుకు వాహనం నిలిపారు.
కాలకృత్యాలు పూర్తి చేసుకునేందుకు ప్రేమ్లత అనే మహిళ సమీపంలో ఉన్న ముంబాయి జాతీయ రహదారి దాటి వెళ్లి కాలకృత్యాలు పూర్తి చేసుకుని తిరిగి వాహనం వద్దకు వస్తు జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో అతి వేగంతో వచ్చిన ఓమిని వాహనం ఢీకోనడంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు.