నారాయణఖేడ్, ఆగస్టు 29 : గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ నారాయణఖేడ్ పట్టణాన్ని అస్తవ్యస్తంగా మార్చింది. ఖేడ్ను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాను అహర్నిషలు కృషి చేస్తున్నానని, ఇందుకు ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హాయాంలో పట్టణంలో రూ.200ల చొప్పున 550 పింఛన్లు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం రూ.2,016ల చొప్పున 2,800ల పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో ఖేడ్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధపోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. అదే విధంగా అంగన్వాడి టీచర్లకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.