కల్హేర్, నవంబర్ 26 : రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని కృష్ణాపూర్ గ్రామానికి చెందిన హస్నపురం వెంకట్రెడ్డికి రూ.12వేయలు, మన్నాన్బీ కి రూ. లక్షా 50వేలు, అదే విధంగా బాచేపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాజ్ రూ. 34వేలు, బీబీపేట్ తండాకు చెందిన మారుతికి రూ.21వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరమన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులకు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు రామావత్ రాంసింగ్, కృష్ణాపూర్ సర్పంచ్ కిష్టారెడ్డి, బాచేపల్లి పీఏసీఎస్ చైర్మన్ సంగారెడ్డి, నాయకులు అంజయ్యసాగర్, రాంరెడ్డి, బ్రహ్మం ఉన్నారు.