కంగ్టి, జూన్ 12 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భోజ్యనాయక్తండా బీటీరోడ్డుకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతపాలకులు గ్రామాలను పట్టించుకోవపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తరువాత అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్లను మంజూరు చేసిందన్నారు. అంతేకాకుండా ప్రతిగ్రామం, తండాలకు బీటీరోడ్లు మంజూరు చేసి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గతరెండు సంవత్సరాల క్రితమే భోజ్యనాయక్ తండాకు బీటీరోడ్డు మంజూరైతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు వేయలేదన్నారు. దీంతో మరోకరికి టెండర్ అప్పగించి రోడ్డు వేస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్నివర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో రైతుబంధుసమితి మండలాధ్యక్షుడు కోట ఆంజనేయులు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంగారం, గ్రామసర్పంచ్ శర్ణప్ప, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి, సతీశ్, పండరినాథ్రావు లు పాల్గొన్నారు.