ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామ శివారులోని మల్లయ్య గిరి ఆశ్రమాన్ని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవత్ కుబా దంపతులు సందర్శించి స్వామివారికి పూజలు చేశారు.
అంతకుముందు దంపతులకు ఆశ్రమ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. వారికి ఆశ్రమ విశిష్టతను తెలియజేసి ఘనంగా సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.