సదాశివపేట: మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు. మద్దికుంట గ్రామానికి చెందిన ఎండీ.రషీద్, మొల్ల జాకీర్లు మద్దికుంట చౌరస్తాలో గంజాయి విక్రయిస్తున్నారని వెల్లడించారు. వీరు గత కొంత కాలంగా హైదరాబాద్లోని దూల్పేట నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేసి మద్దకుంట గ్రామంలో విక్రయిస్తున్నారని తెలిపారు.
అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి నుంచి 350 గ్రాముల ఎండు గంజాయి, మోటర్ సైకిల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గంజాయిని పండించినా, అమ్మినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.