న్యాల్కల్ : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో ఇటీవల పార్టీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పార్టీ ఇన్సూరెన్స్ కింద రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి.
ఎమ్మెల్యే మృతుడి ఇంటికి వెళ్లి భార్య రంగమ్మకు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
అనంతరం మండల కేంద్రమైన న్యాల్కల్ రైతు వేదికలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హద్నూర్, చాల్కి, ముంగి, ఇబ్రహీంపూర్, న్యాల్కల్ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 3.98 లక్షల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు పార్టీపరంగా క్రియాశీల సభ్యత్వాన్ని చేయించిందని తెలిపారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన ఆర్థిక సాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వారి ఆరోగ్యాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, మండల నాయకులు నరసింహారెడ్డి , భాస్కర్, వెంకట్, ఈశ్వర్, నర్సప్ప, చంద్రశేఖర్ రెడ్డి, మచ్చేందర్, మసూద్, శివ స్వామి, శివరాజ్, సత్యనారాయణ, సర్పంచులు రవికుమార్, మారుతి యాదవ్, మీనాక్షి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.