పటాన్చెరు టౌన్, జనవరి 12 : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి అండగా ఉంటున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద 146 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.కోటి 46లక్షలకు పైగా లబ్ధిదారులకు అందజేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఆడపిల్ల పెండ్లికి భరోసా కల్పించేందుకే ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పేద వర్గాల యువతులకు ఈ పథకాలు ఎంతో లాభకరంగా ఉన్నాయన్నారు.
అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెక్ల ద్వారా నగదు బదిలీ జరుగుతున్నదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఆడబిడ్డ పెండ్లికి అండగా నిలుస్తున్నామన్నారు. ఆడపిల్లలకు కేజీ టు పీజీ వరకు ఉచిత చదువు చెబుతున్నామన్నారు.
వారి కాళ్లపై వారు నిలిచేలా డ్వాక్రా సంఘాలకు రుణాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళలకు భారీగా అవకాశాలు ఇచ్చి వారు అన్ని రంగాల్లో రాణించేలా చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్కుమార్, ఎంపీపీలు సుష్మాశ్రీ వేణుగోపాల్రెడ్డి, ఈర్ల దేవానందం, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, తహసీల్దార్ మహిపాల్రెడ్డి, నాయకులు అఫ్జల్, బీ వెంకట్రెడ్డి, దశరథరెడ్డి, సర్పంచ్లు నీలం మధుముదిరాజ్, ఉపేందర్, అంతిరెడ్డి, మానిక్రెడ్డి, ఎంపీటీసీ మన్నెరాజు పాల్గొన్నారు.