రామచంద్రాపురం,మే13 : నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్నగర్కాలనీలో ఉన్న షాపింగ్ ఏరియాలో సొంత ఖర్చుతో వర్తక సంఘం, ఎమ్మెల్యే సంయుక్తంగా ఏర్పాటు చేయించిన 25 సీసీ కెమెరాలను శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ పుష్పతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపుచేయవచ్చని పేర్కొన్నారు. వర్తక సంఘం ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవడం అభినందనీయమన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరాల అదుపు కోసం హైదరాబాద్ నగరంలో వేల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిందన్నారు.
అనంతరం ఎమ్మెల్యేను వర్తక సంఘం సభ్యులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, ఏఎంసీ డైరెక్టర్ ప్రమోద్గౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఘని, వర్తక సంఘం అధ్యక్షుడు జైరాం, రమేశ్, నాగభూషణంచారి, రవి, శ్రీధర్, డి.శ్రీనివాస్, విక్రమ్సింగ్, ప్రవీణ్, చంద్రఖేకర్రెడ్డి, ఖదీర్, గఫార్, బేకు యాదయ్య, కృష్ణమూర్తిచారి తదితరులు పాల్గొన్నారు.