సంగారెడ్డి : టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బోడ వెంకటేశ్వరరావు ఫరీదుద్దీన్ వెంకటయ్య ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని పార్టీ సంస్థాగత ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.