సంగారెడ్డి : జిల్లాలోని గుమ్మడిదల మండల కేంద్రంలో కేంద్ర బృందం పర్యటించింది. పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించారు. సోమవారం గుమ్మడిదల గ్రామంలో కేంద్ర బృందం ప్రతినిధులు శివ కుమార్, స్వప్న, నాగేశ్వరరావు అధికారుల అ బృందం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఇందులో భాగంగా పల్లె ప్రగతిలో చేపట్టిన పల్లె ప్రకృతి వనం నిర్మాణాలను డంపింగ్ యాడ్ ను పరిశీలించారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త వేరు చేసే డబ్బులను పరిశీలించారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చెత్తను ఏవిధంగా తరలిస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు ఉన్నాయా లేవా అని తెలుసుకున్నారు .
అదేవిధంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్ణయించుకున్నారా లేదా అనే విషయాన్ని నివేదిక తయారు చేశారు. ఎంఆర్ జిఎస్ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణాలు పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటును చూసి అభినందించారు.