కల్హేర్ : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కల్హేర్, కృష్ణాపూర్, మిర్కాన్పేట్, రాంరెడ్డిపేట్, బాచేపల్లి, రాపర్తి గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో చేపలను పెంచేందుకు ప్రభుత్వం ఉచితంగా అందించిన చేపపిల్లలను మత్స్యకారులకు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని కొనియాడారు.
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నదన్నారు. పెంచిన చేపలను మార్కెట్కు తరలించేందుకు ద్విచక్ర వాహనాలతోపాటు ఆటోలు, వలలు, ఇతర సామగ్రిని అందించడం జరిగిందన్నారు. మత్స్యకారుల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కొల్చారం మండలంలో ప్రత్యేకంగా గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహారెడ్డి, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు అలీ, జలంధర్, కృష్ణాపూర్ సర్పంచ్ కిష్టారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఘని, కల్హేర్ పీఏసీఎస్ చైర్మన్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, నాయకులు బాలయ్య, వెంకట్రెడ్డి, నర్సింహగౌడ్, నాగిరెడ్డి, మత్స్యశాఖ ఎఫ్డీవో రషీద్, ఎఫ్ఏ రాకేశ్, ఫిషర్మెన్ భిక్షపతి, మత్స్యకార సంఘం అధ్యక్షుడు భిక్షపతి, ఉపాధ్యక్షుడు అబ్బయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు.