అందోల్, అక్టోబర్ 13: దసరా పండుగను పురస్కరించుకుని శనివారం వట్పల్లిలోఅలాయ్..బలాయ్ కార్యక్రమం నిర్వహించనుండగా బుధవారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ స్థలాన్ని పరిశీలించారు.
వట్పల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్యక్రమం నిర్వహించనుండగా పార్టీ శ్రేణులతో కలిసి స్థలాన్ని పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.