సదాశివపేట, నవంబర్ 23 : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సదాశివపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీసులకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలో ఎస్ఐ అంబారియా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
రేషన్ బియ్యాన్ని సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు తరలిస్తున్న టీఎస్ 15యూఈ (2032 ) నంబర్ గల టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ ప్రశాంత్కుమార్, దుకాణ యజమాని కంది కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంబారియా తెలిపారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.