సంగారెడ్డి, సెప్టెంబరు 16 : ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో రాజకీయ పార్టీలు కులాలు, మతాల పేరుతో ప్రజ ల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికోట్టాలని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మైదానంలో అధికారికంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్సీ వజ్రోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రదాన రహదారి గుం డా స్థానిక అంబేద్కర్ మైదానానికి చేరుకున్నది. 15 వేల మంది ప్రజలు, మహిళలు, విద్యార్థులతో మైదా నం కిక్కిరిసింది. కళాకారుల నృత్యాలు, నటరాజ్ నా ట్యామండలి కళకారుల బిందెపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మపర్స న్, కలెక్టర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ చైర్మన్ చింత ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతియుతంగా ప్ర జల మధ్య కుల, మతాలకు అతీతంగా పండుగలు జ రుపుకుంటూ సోదరాభావాన్ని చాటి చెప్పే నైజం తెలంగాణ ప్రజలదని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా, సీడీసీ చైర్మ న్ బుచ్చిరెడ్డి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, కలెక్టరేట్ ఏవో స్వర్ణలత, ఆర్డీవో మెంచు నగేశ్, తహసీల్దార్లు స్వామి, రమాదేవి, ఆశాజ్యోతి, ఆర్అండ్బీ అధికారులు, సురేశ్కుమార్, రవీందర్, శశాంక్, ఎంపీడీవో రవీందర్, కోటేశ్వర్రావు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
సంస్థానం వీలినంతో తెలంగాణకు స్వాతంత్య్రం
దేశంలోని ఏ రాష్ట్రం అభివృద్ధి చెందని విధంగా తెలంగాణ అభి వృద్ధి చెందింది. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ఇతర రాష్ర్టాలు తెలంగాణ వైపు పరుగులు తీస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రంపై విషం చిమ్ముతున్నాయి. సంగారెడ్డి లో 750మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఏ జిల్లాలో చేయని విధంగా జిల్లాలో వేడుకలు నిర్వహించారని మంత్రి హరీశ్రావు కితాబిచ్చారు.
– చింత ప్రభాకర్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్
రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మూడు రోజుల పాటు జరుపుకోవడం సంతోషకరం. సమైక్యతా అంటే ప్రజలందరూ సంఘటితంగా ఉండటమే.
– శరత్కుమార్ నాయక్, సంగారెడ్డి కలెక్టర్