సంగారెడ్డి/అందోల్/సదాశివపేట/పటాన్చెరు, సెప్టెంబర్ 13 : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి చింతా ప్రభాకర్కు హ్యాండ్లూమ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం సంతోషకరమని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహంలో ప్రధాన రహదారిపై పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు జరుపుకొన్నారు. సదాశివపేట పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతాగోపాల్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. కంది మండల కేంద్రంలో ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడికి చైర్మన్ పదవి పట్టం కట్టి సముచిత గౌరవం ఇచ్చారని సీఎం కేసీఆర్కు కొనియాడారు. ఈ వేడుకల్లో పట్టణాధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సింములు, కౌన్సిలర్లు రామప్ప, శ్రీకాంత్, సోహైల్ అలీ, షేక్ సాబెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నరహరి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి,ఆత్మ చైర్మన్ కృష్ణాగౌడ్, సర్పంచ్ విమల వీరేశం, ఉపసర్పంచ్ ఖాజా, ఎంపీటీసీ నందకిశోర్, నాయకులు పాల్గొన్నారు.
సదాశివపేటలో ..
సదాశివపేట అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆరిఫొద్దీన్, సొసైటీ చైర్మన్ రత్నాకర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నవీన్, ఎంపీటీసీలు సుధాకర్, అల్లం లలిత, సర్పంచ్లు లక్ష్మారెడ్డి, అశోక్, నాయకులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు
రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిలను కలిసి ఆశీస్సులు అందుకున్నా రు. మంగళవారం హైదరాబాద్కు వెళ్లి శాసనసభ ప్రాంగణంలో మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట నాయకులు బక్కి వెంకటయ్య, మల్లేశం ఉన్నారు.పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.