సంగారెడ్డి, సెప్టెంబర్8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఏటా జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించి ఆ మేరకు మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాలో 16,497 స్వయం సహాక సంఘాలకు రూ.699.94 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటి వరకు 5,198 సంఘాలకు రూ.324.42 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారు. రుణాల పంపిణీలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. సంగారెడ్డి తర్వాత మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో ద్వితీయ స్థానంలో కామారెడ్డి, తృతీయ స్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో కూడా లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేసి, గతేడాది లాగే రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచినట్లు డీఆర్డీవో శ్రీనివాస్రావు తెలిపారు.
వందశాతం రుణాలే లక్ష్యంగా..
జిల్లాలో మహిళా సంఘాలకు వందశాతం రుణా లు పంపిణీ చేసేందుకు ముందస్తుగానే అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. మండలాల వారీగా లక్ష్యాలు నిర్థేశించుకుని అందుకు అనుగుణంగా బ్యాంకర్లతో సమావేశమవుతున్నా రు. లింకేజీ రుణాలకు అర్హులైన మహిళా సంఘాలను గుర్తించి వారిని బ్యాంకర్ల వద్దకు తీసుకెళ్తున్నారు. తీసుకున్న రుణ మొత్తంతో మహిళా సం ఘాల సభ్యులు వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.
5198 గ్రూపులకు రూ.324 కోట్లు పంపిణీ
జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 16,497 మహి ళా సంఘాలకు రూ.699.94 కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నారు. ఇందులో ఇప్పటి వరకు 5198 మహిళా సంఘాలకు రూ.324.42 కోట్ల రుణాలు అందజేశారు. జిన్నారం మండలంలో రూ.11.24 కోట్లు, సంగారెడ్డిలో రూ.8.94 కోట్లు, అమీన్పూర్ రూ.5.40 కోట్లు, కోహీర్ రూ.21.18 కోట్లు, హత్నూర రూ.26.96 కోట్లు, అందోల్ రూ.11.95 కోట్లు, నారాయణఖేడ్ రూ.18.88 కోట్లు, రాయికోడ్ రూ.12.27 కోట్లు రుణాలు అందజేశారు. నాగల్గిద్ద మండలంలో బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పటి వరకు రూ.6.93 కోట్లు, కల్హేర్ రూ.10.35 కోట్లు, పుల్కల్ రూ.15.57 కోట్లు, మనూరులో రూ.7.76 కోట్లు, గుమ్మడిదల రూ.11.86 కోట్లు, సిర్గాపూర్ రూ.9.74 కోట్లు, న్యాల్కల్ రూ.12.17 కోట్లు, సదాశివపేట రూ.18.27 కోట్లు, కొండాపూర్ రూ.15.82 కోట్లు రుణాలు అందజేశారు. కంగ్టి మండలంలో రూ.12.15 కోట్లు, వట్పల్లి రూ.6.94 కోట్లు, జహీరాబాద్ రూ.9.73 కోట్లు, మొగుడంపల్లి రూ.6.82కోట్లు, ఝరాసంగం రూ.11.05 కోట్లు, పటాన్చెరు 23.82 కోట్లు, మునిపల్లి రూ.17.72కోట్లు, కంది రూ.10.79 కోట్ల రుణాలు అందజేశారు. ఆరుమాసాల్లో 5198 మహి ళా సంఘాలకు రుణాలు అందజేశారు. మార్చి వరకు లక్ష్యం మేరకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తాం
మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయడంలో రాష్ట్రంలోని మిగితా జిల్లాల కంటే సంగారెడ్డి అగ్రస్థానంలో ఉంటుంది. గతేడా ది బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్థిక మంత్రి హరీశ్రావు, కలెక్టర్ శరత్ సహకారంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తామన్న నమ్మకం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 16497 సంఘాలకు రూ.699.94 కోట్లు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 5198 సంఘాలకు రూ.324.42 కోట్లు మంజూరు చేశాం. మార్చి నాటికి లక్ష్యానికి మించి రుణాలు అందజేసి రాష్ట్రంలో తిరిగి అగ్రస్థానంలో నిలుస్తాం.
– శ్రీనివాస్రావు, డీఆర్డీవో