సంగారెడ్డి, సెప్టెంబరు 8: నిమజ్జనాలు ప్రశాంతంగా జరుపుకో వాలని సంగారెడి ఎస్పీ రమణకుమార్ భక్తులకు సూచించారు. గురువారం పట్టణంలోని మహబూబ్ చెరువు కట్ట పై చేసిన ఏర్పాట్ల ను ఎస్పీ సందర్శించారు. పోలీస్, రెవె న్యూ, ఇరిగేషన్, విద్యుత్, మున్సిపల్, ఆబ్కారీ, అగ్నిమాపక, ఫిషరీస్, రోడ్లు భవనాలశాఖ అధికారులు శోభాయాత్రకు ఎలాంటి అవంతరాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 10న వినాయక నవరాత్రులు ముగించుకుని నిమజ్జనాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, అందుకు మహబూబ్ సాగర్కట్టపై అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా గణేశ్ విగ్రహాల ఊరేగింపునకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేయా లన్నారు. శోభాయాత్రకు అవసరమ య్యే విద్యుత్, రహదారులపై మరమ్మతులు చేయాలన్నారు.
మహబూబ్సాగర్ కట్టపై లైటింగ్, బారికేడ్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లును అందుబాటులో ఉంచాలన్నారు. శనివారం సాయంత్రం 4గంటల నుంచి వినాయక విగ్రహాలను రథాలపై ఎక్కించి రాత్రి 12గంటల వరకు కట్టపైకి రావాలని నిర్వాహకులకు ఎస్పీ సూచించారు. నిమజ్జనం రోజున నిమజ్జన వాహనాలు మళ్లీ వెనక్కి రాకుండా ముందుకు సాగుతూ శిల్పారామం వైపు నుంచి ప్రధాన రహదారికి చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ము ఖ్యంగా ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ రవీంద్రారెడ్డిని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రవీంద్రారెడ్డి, తహసీల్దార్ స్వామి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, పట్టణ ఇన్స్పెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలి: సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్
ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రమణకుమార్ సూచించారు. గురువారం స్థానిక ఊబచెరువుపై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఊబచెరువుపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ నవీన్కుమార్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మున్సి పల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్ విశ్వనాథం ఉన్నారు.
డ్రైవర్లు పాటించాల్సినవి..