సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 1: పేదలకు అన్నివిధాలా అండగా నిలుస్తూ సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పేదలకు ఒక్కొక్కరికీ 10 కిలోల రేషన్ బియ్యం, రూ.2016 పింఛన్ ఇస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్న మహానుభావుడు కేసీఆర్ అని తెలిపారు. గురువారం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్లో కొత్త ఆసరా పింఛన్ల సర్టిఫికెట్లను మంత్రి లబ్ధిదారులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 కోట్ల చొప్పున యేడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 33,795 మందికి, సంగారెడ్డి నియోజక వర్గంలో 5,321 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేశామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ అవుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పింఛన్ ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 యేండ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారన్నారు. మీరు కూడా ప్రభుత్వానికి అండగా నిలువాలన్నారు. టీడీపీ హయాంలో రూ.75, కాంగ్రెస్ రూ.200 మాత్రమే ఇచ్చారని, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 25 వేల పింఛన్లు ఉంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 45 లక్షల మందికి ఇస్తున్నామని అన్నారు. పింఛన్లు రాని అర్హులు ఎవరైనా ఉంటే, వారికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం
ఇంటి జాగ ఉన్న నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి ఆర్థిక సాయం అంజేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని, దసరా నుంచి అమలు చేస్తారని అన్నారు. ఇప్పటికే ఇల్లులేని పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామన్నారు.
అర్హులందరికీ పింఛన్లు
దేశం గర్వించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. అందోల్ మండలంలోని కంకోల్ గ్రామంలో ఉన్న అభిషేక్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పింఛన్ల కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కొత్త పింఛన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. ఉత్తమ పంచాయతీల్లో తెలంగాణ రాష్ట్రం ముందున్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో నాగేశ్, డీపీవో సురేశ్మోహన్, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్ రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మా ణిక్యం, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మ్పర్సన్ లతా విజయేందర్రెడ్డి, సంగారెడ్డి, కంది మండలాల ఎంపీపీలు లావణ్య దుర్గేశ్, సరళ, జడ్పీటీసీలు సునీతా మనోహర్గౌడ్, కొండల్రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో రమేశ్ చంద్ర కులకర్ణి, నాయకులు సాయికుమార్, జైపాల్రెడ్డి, భిక్షపతి, అల్లం నవాజ్రెడ్డి, ఎంపీపీ శైలజా శివశంకర్, జడ్పీటీసీ మీనాక్షి సాయికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, యువత అధ్యక్షుడు ఆనంద్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పరశురాంగౌడ్, మైనార్టీ అధ్యక్షుడు ఆనంద్, కో ఆప్షన్ సభ్యుడు సలవోద్దిన్, ఆయా గ్రామాల సర్పంచ్లు విశ్వనాథం పాటిల్, రమేశ్, శ్రీనివాస్, విజయ్భాస్కర్, అశోక్, స్వప్న, బిందేశ్వరి, కిర్తీకుమారి, ఎంపీటీసీలు స్వప్నభాస్కర్, లక్ష్మీనాగేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, గారిబొద్దీన్, మల్లేశం, చెన్న వీరయ్య స్వామి ఉన్నారు.
ఆలయ అభివృద్ధికి రూ.25 లక్షలు
జిల్లాలో 11వ శతాబ్ధం నాటి ఆలయం ఉండడం జిల్లావాసుల అదృష్టమని, ఆలయ అభివృద్ధికి తక్షణమే రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో కొలువుదీరిన రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి మంత్రి గురువారం సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఎస్డీఫ్ నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆలయంలో నిత్యం భజన చేసే భక్తజన బృందాన్ని మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుందెన రాజు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దేశంలో రూ.2వేల పింఛన్ ఎక్కడా లేదు: అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పిం ఛన్లు అందిస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.గురువారం మండల పరిధిలోని కంకోల్లోని అభిషేక్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతంగా మంజూరు చేసినా ఆసరా పింఛన్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.2వేల ఆసరా పింఛన్ ఏ రాష్ట్రంలో అమలుల్లో లేదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.కరోనా సమయంలోనూ ప్రభుత్వ పింఛన్లు ఆపకుండా అందించిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు.ఇతర రాష్ర్టాల్లో పింఛన్లు తక్కువగా ఇవ్వడమే కాకుండా,కొన్ని రాష్ర్టాల్లో మొత్తమే నిలిపియేడం జరిగిందన్నారు.పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవినీతి అక్రమాలు ఉండవని, అంతా ఆన్లైన్లోనే జరుగుతుందన్నారు.ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.గత పాలకులు కేవలం రూ.75, రూ.200 పింఛన్లు మాత్రమే ఇచ్చేవారని, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,016ఇస్తూ ఆసరా లబ్ధిదారులకు కొండంత అండగా నిలుస్తుందన్నారు.