పటాన్చెరు/పటాన్చెరు టౌన్, ఆగస్టు 22: దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలో అత్యంత పురాతన శ్రీమాణిక్ప్రభు దేవాలయంలో చేపట్టిన జీర్ణోద్ధారణ కార్యక్రమంలో భాగంగా శివ పంచాయతన హనుమ నవగ్రహ బొడ్రాయి మాణిక్య ప్రభు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి పాల్గొని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముక్కోటి దేవతల ఆశీస్సులుండటంతోనే నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నదన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు పురాతన ఆలయాలను జీర్ణోద్ధారణ చేయడం, మాణిక్ ప్రభు దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని కొనియాడారు.
రూ.2.20 కోట్లతో అభివృద్ధి.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
అత్యంత పురాతనమైన మాణిక్ ప్రభు దేవాలయాన్ని రూ.2.20 కోట్లతో జీర్ణోద్ధారణ చేశామని, ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో అనేక దేవాలయాలను నూతనంగా నిర్మించామన్నారు. పురాతన దేవాలయాలను జీర్ణోద్ధారణ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, డీఎస్పీ భీమ్రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పానగేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.