సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 8: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా సోమవారం సంగారెడ్డిలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇం డియా స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 14న గ్రామాలు, పట్టణా ల్లో జనజాగరణ చేయాలన్నా రు.15న జాతీయ జెండాలను ఆవిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభు త్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పేదల సం క్షేమాన్ని మరిచి పెట్టుబడిదారుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని ధ్వజమెత్తా రు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం సుదీర్ఘకాలం పాటు పోరాడి విజయం సాధించిన రైతన్న స్ఫూర్తితో కేంద్ర నిరంకుశ వైఖరిపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీఐటీయూ, సీపీఎం నాయకులు మల్లేశం, రాజయ్య, బాగారెడ్డి, జయరాజు, నర్సింలు, రమేశ్, అనిల్, నాగభూషణం, ఆంజనేయులు, శ్రీధర్, బాల్రాజ్ పాల్గొన్నారు.