సంగారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను విజయవం తం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇం దుకు సంబంధించి రోజువారీ కార్యక్రమాలను వివరించారు. సోమవారం సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించినట్లు తెలిపారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా థియేటర్లలో విద్యార్థులకు గాంధీ చలనచిత్రాన్ని చూపించాలన్నారు. జిల్లాలోని 14 సినిమా థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్కు సూ చించారు. సినిమా ప్రదర్శన బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించాలన్నారు. 11న ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని తెలిపారు. 12న జాతీయ సమైక్యతా రక్షాబంధన్, 13న సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహించాలన్నారు. ర్యాలీకి హాజరవుతానని చెప్పా రు.
14న జానపద కళాకారుల ప్రదర్శన, పటాకులు కాల్చాలన్నారు. 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నా రు. వజ్రోత్సవాలను పురస్కరించిన ప్రతిఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేసేలా చూడాలన్నారు. ఇందుకోసం జెండాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 16న కవి సమ్మేళనం, 17న జిల్లా, మండల కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. 75 మం దికి తక్కువ కాకుండా రక్తదానం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభు త్వ దవాఖానల్లో రక్తదానం చేసేలా చూడాలని కలెక్టర్ శర్తను ఆదేశించారు. 18న ప్రీడమ్ కప్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహించాలని తెలిపారు. 19న జైళ్లు, దవాఖానల్లో పండ్లు పంపిణీ, 20న మహిళకు ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. 22న హైదరాబాద్లో ముగింపు వేడుకలు ఉంటాయన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు వజ్రోత్సవ వేడుకలను విజయవం తం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా మాట్లాడారు. వజ్రోత్సవ వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. వజ్రోత్సవాలు 15 రోజులపా టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కావాలన్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గంలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏ ర్పాటు చేస్తున్నామని, ఈ సందర్భంగా వేడుకలకు మంత్రి హరీశ్రావును ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలు, పల్లెల్లో ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు. జిల్లాలో కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ను అందరూ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు.