నాగల్గిద్ద, జూలై 9: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా చెరువుల్లోకి వరద నీరు చేరుతుంది. ఎడతెరపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించింది. పొలాలన్ని చెరువులను తలపిస్తున్నాయి. మంజీరానదిలో వరద నీరు వచ్చి చేరుతుంది.
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి
అమీన్పూర్, జూలై 9: భారీ వర్షాల కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీవాసులు, అపార్ట్మెంట్స్, సెల్లార్ అపార్ట్మెంట్స్, వాణిజ్య భవనాల యజమానులు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలన్నారు. 2రోజులుగా కురుస్తు న్న వర్షాలతో అమీన్పూర్ పెద్ద చెరువు నిండి అలుగు పోసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అలుగు కింద ఉన్న గృహ యాజమానులు అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. సెల్లార్లలోకి వరదనీరు వచ్చేవారు అక్కడ ఉండే విద్యుత్ ప్యానెల్ బోర్డులను గ్రౌండ్ ఫ్లోర్లోకి మార్చుకోవాలన్నా రు. దీంతో షార్ట్ సర్క్యూట్ కాకుండా నివారించవచ్చన్నా రు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిన్నారం, జూలై 9: కురుస్తున్న వర్షాలతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ దశరథ్, జిన్నారం విద్యుత్ శాఖ ఏఈ రాజు శనివారం వేరు వేరు ప్రకటనల్లో తెలిపారు. వారు మాట్లాడుతూ వర్షాలు, ఈదు రు గాలులతో కరెంటు వైర్ల కింద ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. వర్షానికి పాత ఇండ్లు తడిసిపోవడం వలన గోడలు కూలే ప్రమాదం ఉందని అలాంటి ఇండ్లను ఖాళీ చేయాలన్నారు. కరెంటు వైర్లు తెగిన, స్తంభాలు విరిగిన విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు.
మండల వ్యాప్తంగా వర్షం
ఝరాసంగం,జూలై9: మండల వ్యాప్తంగా అన్ని గ్రా మాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం పడింది. దీంతో అన్నదాతలు తాము వేసిన విత్తనాలు మొలకెత్తేందుకు ఈ వర్షం ఆసరా అవుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పొంగి పోర్లుతున్న వంగ్దాల్ వాగు
సిర్గాపూర్, జూలై 9: విస్తారంగా కురుస్తున్న వర్షానికి మండలంలోని గ్రామాల్లో వాగులు, వంకలు, కుంటలు పొంగుతున్నాయి. వంగ్దాల్ శివారులోని పెద్ద వాగు పొంగి దిగువకు నల్లవాగులోకి ఉరకలేస్తోంది. వాగు ప్రవాహం ఉధృతి కారణంగా గైరాన్తండా, గట్టుమీద గైరాన్తండాల ప్రజల రాకపోకలు స్తంభించాయి. కాగా, మండలంలోని వాగులు పొర్లడంతో పెసర, కంది, సోయా, పత్తి తదితర పంటలు నీట మునిగాయి.
భారీ వర్షాలతో జాగ్రత్తగా ఉండాలి
రాయికోడ్,జూలై9: గ్రామాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్ఐ ఏడుకొండలు అన్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలు, రైతులు, చిన్నారులు గ్రామాల్లో ఉన్న వాగు లు, కాలువలు, నదుల, రిజర్వాయర్లు, చెరువుల వద్ద కు వెళ్లవద్దన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రా మాల్లో అత్యవసరమైతే 100 నంబరుకు సమా చారం ఇవ్వాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పుల్కల్, జూలై 9: భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పరమేశం అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్షం పడుతున్నప్పుడు కరెంట్ స్తంభాలను తాకరాదన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో కూడా ప్రజలు ఉండొదన్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
కంగ్టి, జూలై 9: కురుస్తున్న వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకటేశ్వర్రావు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజలు నీటిమయమైన గుంతలవద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాగుల వద్ద వరదనీరు ప్రవహిస్తున్న క్రమంలో వాగులు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దని వెల్లడించారు. ఎక్కడైనా వరదకు సంబంధించిన సమస్యలు తలెత్తుతే వెంటనే పోలీసులకు సంప్రదించాలన్నారు.
రాయికోడ్..
రాయికోడ్,జూలై9: మండల పరిధిలోని వివిధ గ్రామా ల్లో భారీ వర్షం కురవడంతో రైతుల వ్యవసాయ పనులను నిలిపివేశారు. ముఖ్యంగా శుక్రవారం నుంచి శనివారం వర కు నిరంతరంగా కురుస్తున్న వర్షంతో రైతులు వేసిన పంటలకు మేలు జరుగుతుందటున్నారు.
ఎడతెరిపి లేకుండా..
రామచంద్రాపురం, జూలై 9 : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులకు జలకళ వ చ్చింది. వర్షాలకు డ్రైనేజీలు నిండి నీరు రోడ్లపైన నిలుస్తున్నాయి. ఆర్సీపురం డివిజన్లోని పలు కాలనీల్లో కార్పొరేటర్ పుష్పానగేశ్ పర్యటించి రోడ్లపై వర్షపు నీరు నిలువకుం డా బల్దియా సిబ్బందితో చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో అవసరమైతేనే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.