షోకాజ్ నోటీసులతో పాలకమండలిలో కదలికలు
పటాన్చెరు, ఏప్రిల్ 16: జిల్లా కలెక్టర్ ఇంద్రేశం పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాలకమండలిలో కదలిక ప్రారంభమైంది. పటాన్చెరు మండలం ఇంద్రేశంలో శుక్రవారం కార్యదర్శి కిషోర్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. జీపీ పరిధిలో అనుమతులు తీసుకున్న వ్యక్తులు నాలుగైదు అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు. పైగా, పెంట్హౌజ్ నిర్మాణం చేసీ భారీ భవంతులు నిర్మిస్తున్నారు. భద్రత, నాణ్యతాప్రమాణాలు గాలికొదిలి అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకునేందుకు కార్యదర్శి కార్యచరణలోకి దిగారు. షోకాజ్ సమయానికి ముందు 18 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసుల తరువాత మరో 6 నిర్మాణాలకు మైత్రి కాలనీలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ పనులు నిలిపివేసిన కొందరు పనులు జరుపుతుండటంతో అధికార బృందం నిర్మాణ సామగ్రిని పంచాయతీకి తరలించారు. పాలకవర్గంనుంచి సహాయ నిరాకరణ ఉన్నా పంచాయతీ అధికారులు నిబంధనలను అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నారు. ఇంద్రేశం సర్పంచ్, ఉప సర్పంచ్లకు గతంలోను షోకాజ్ నోటీసులు జారీ అయినను పనులు కొనసాగుతుండటం విశేషం.