సంగారెడ్డి, మే 14: సమాజంలో కుల వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యదయవాది బసవేశ్వరుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంటోని బైపాస్ రోడ్డులోని అండర్పాస్ బ్రిడ్జి ముందు ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలక్టెర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ జయంతి వేడుకలు స్థానిక కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు శివరాజ్ పాటిల్, సిద్దేశ్వర్, మధుశేఖర్, బస్వరాజ్, చంద్రకాంత్ ఉన్నారు.
బసవేశ్వరుడి స్ఫూర్తిని ఆచరించాలి
12వ శతాబ్దానికి ముందు బసవేశ్వరుడు కుల, మాతలాకతీతంగా సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప మహనీయుడని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శుక్రవారం బసవేశ్వరుడి 888 జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఆధ్వర్యంలో అధికారికంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో మెంచు నగేశ్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు శివరాజ్ పాటిల్, సిద్దేశ్వర్, మధుశేఖర్, బస్వరాజ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్
సదాశివపేట, మే 14 ః మహాత్మ బసవేశ్వరుడి 888వ జయంతి వేడుకల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. శుక్రవారం బసవ జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలోని బసవేశ్వర మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను నేటి త రం ముందుకు తీసుకుపోవాలని సూచించారు. కార్యక్రమంలో బసవేశ్వర మందిర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
ఘనంగా బసవేశ్వరుడి జయంతి
గుమ్మడిదల, మే14:మండలంలోని వీరన్నగూడెం వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి వీరశైవలింగాయత్ సమాజం గ్రామ అధ్యక్షుడు గటాటి రమేశ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వేణు, బసవరాజు, మడపతి గణేశ్, శివనాగులు, సోమయ్య, అనిల్ పాల్గొన్నారు.
డీసీఎంఎస్ కార్యాలయంలో..
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 14: సంగారెడ్డిలోని డీసీఎంఎస్ కార్యాలయంలో బసవేశ్వర జయంతిని శుక్రవారం లింగాయత్ సమాజం అధ్యక్షుడు సులుగంటి సిద్ధేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ హాజరై బసవేశ్వర చిత్రపాటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో లింగాయత్ సమాజం సభ్యులు సీహెచ్ బస్వరాజ్, రామప్ప, చంద్రకాంత్, మధుశేఖర్, బస్వరాజ్ పాల్గొన్నారు.
జీవితం స్ఫూర్తిదాయకం
సిర్గాపూర్: ఉజలంపాడ్లో స్థానిక సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు శోభావతి, తెలంగాణ జాగృతి యువ విభాగం అధ్యక్షుడు అరుణ్రాజ్శేరికార్ స్థానిక కూడలిలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేసి ఘన నివాళుర్పించారు.
బసవేశ్వరుడిని మార్గం ఆచరణీయం
ఝరాసంగం, మే14: బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్యశిఖామణి అవధూతగిరి మహారాజ్, మల్లయ్యగిరి ఆశ్రమ పీఠాధిపతి బసవలింగమహారాజు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మహానీయుడు బసవేశ్వరుడి 888 జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, వీరశైవ లింగయాత్ సంఘం నాయకులు పాల్గొన్నారు.