పటాన్చెరు, డిసెంబర్ 30 : బంగారుగడ్డ రైతులకు భరోసా ఏర్పడింది. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రెవెన్యూశాఖ, హెచ్ఎండీఏ శాఖల అధికారులు, రైతులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. పటాన్చెరు పరిధిలోని బంగారుగడ్డలో సర్వే నంబర్ 639లో 30ఎకరాల 38గుంటల అసైన్డ్ భూమిని భవిష్య త్తు అవసరాల కోసం హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకుంది. కాగా రికార్డుల్లో లేకుండా పొజిషన్లో ఉన్న 8ఎకరాల 25గుంటలను స్థానిక దళిత రైతులు సాగు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో పాటు ఎకరా మూడు గుంటల భూమిని స్థానిక నాగసాని కుటుంబ సభ్యులు సాగుచేస్తున్నారన్నారు. ఈ భూమి సాగు చేస్తున్న వారికి పట్టా పాసుపుస్తకాలున్నాయని తెలిపారు. అసైన్మెంట్ భూమిని సాగుచేస్తున్న రైతులకు ప్రభుత్వం తరపున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖ అధికారులు, మంత్రులతో చర్చించి తగు న్యాయం చేయాలని కోరారు. అనంతరం హెచ్ఎండీఏ సీఈ డీఎల్ఎన్ రెడ్డి తో సమస్యపై చర్చించారు. దశాబ్దాలుగా ఎదు ర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యేకి రై తులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో హెచ్ఎండీఏ ఈఈ సత్యప్రసాద్, తహసీల్దార్ పరమేశం, రైతులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కలెక్టర్ ను కోరారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ శరత్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, అదనపు కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం లో అనేక సమస్యలున్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా చిట్కుల్, రుద్రారం గ్రామాల్లో గతం లో నిరుపేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి పొజిషన్ చూపించకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీల కోసం ఏర్పాటు చేయనున్న శ్మశాన వాటికలకు ప్రభు త్వ భూమిని కేటాయించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.