పుల్కల్ రూరల్, అక్టోబర్ 3 : జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు గత వారం రోజులుగా మహారాష్ట్ర ధనేగావ్ నుంచి ఉధృతంగా కొనసాగిన వరద కాస్తా తగ్గుముఖం పట్టింది. ఆదివారం ధనేగావ్ ప్రాజెక్టు నుంచి వరద రూపంలో ఇన్ ఫ్లో 25033 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా అవుట్ ఫ్లో 35126 క్యూసెక్కుల నీటిని మూడు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.